మరో చిత్రంతో మళ్ళీ మెప్పించబోతున్న ‘గీత గోవిందం’ !

మరో చిత్రంతో మళ్ళీ మెప్పించబోతున్న ‘గీత గోవిందం’ !

Published on Aug 17, 2018 6:06 PM IST

‘గీత గోవిందం’ చిత్రంలో తమ కెమిస్ట్రీతో మంచి సక్సెస్ అందుకున్న జంట విజయ్ దేవరకొండ, రష్మిక. కాగా ఈ జంట మళ్ళీ కలిసి నటిస్తోన్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మండన్న క్రికెటర్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా హైదరాబాద్ క్రికెట్ అకాడమీలో శిక్షణ కూడా తీసుకున్నారు.

కాగా సినీవర్గాల సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రంలో క్రికెటర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం మంచి ఉత్కంఠ ఉంటుందట. అలాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మరియు రష్మిక కెమిస్ట్రీ హైలెట్ అవుతుందని చిత్రబృందం చెబుతుంది. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు