సెన్సార్ బోర్డ్ నుండి క్లీన్ యూ సర్టిఫికెట్ అందుకున్న “డియర్ మేఘా”

సెన్సార్ బోర్డ్ నుండి క్లీన్ యూ సర్టిఫికెట్ అందుకున్న “డియర్ మేఘా”

Published on Aug 25, 2021 8:00 PM IST

మేఘా ఆకాష్, అదిత్ అరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తూ సుశాంత్ రెడ్డి దర్శకత్వం లో రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్ మేఘా. ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్లు, టీజర్, లిరికల్ వీడియో సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా కి సంబందించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. 2020 లో కన్నడ లో సూపర్ హిట్ సాధించిన దియా చిత్రానికి ఇది రీమేక్ అవ్వడం తో సినిమా తెలుగు లో ఎలా ఉంటుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం సెప్టెంబర్ మూడవ తేదీన థియేటర్ల లోకి తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు