‘పొగ‌రు’తో రానున్న ‘ర‌ష్మిక మండన్నా’ !

‘పొగ‌రు’తో రానున్న ‘ర‌ష్మిక మండన్నా’ !

Published on Aug 27, 2019 9:30 PM IST

సెన్సేష‌న‌ల్ బ్యూటీ ర‌ష్మిక మండన్నా హీరోయిన్ గా యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు, కన్న‌డ హీరో ధృవ హీరోగా నంద‌కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పొగ‌రు’. శ్రీ జ‌గ‌ద్గురు మూవీస్ బ్యాన‌ర్‌ పై బి.కె.గంగాధ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్రెంచ్‌ బాడీ బిల్డ‌ర్ మోర్గాన్ అస్తే, అమెరిక్ ఐ.ఎఫ్‌.బి.బి ప్రొఫెష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్ కై గ్రీనే, ఇంట‌ర్నేష‌న‌ల్ అథ్లెట్ ఎవాల్యుయేష‌న్ స్పోర్ట్స్ న్యూటీష‌న్ జాన్ లుకాస్‌, జర్మ‌న్ ఫిట్‌నెస్ సెన్సేష‌న్ జో లిన్‌డ‌ర్ వంటి ఇంట‌ర్నేష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్స్ ఈ చిత్రంలో నటిస్తుండటం విశేషం.

ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేర‌కుంది. కొన్ని రోజులుగా హైద‌రాబాద్ రామోజీ ఫిలిమ్ సిటీలో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది. హీరో ధృవ స‌ర్జాకు, ఇంట‌ర్నేష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్స్‌కు మ‌ధ్య జ‌రిగే క్లైమాక్స్ సినిమాకే హైలైట్‌ గా నిల‌వ‌నుంది. భైర‌వ‌గీత ఫేమ్ ధ‌నుంజ‌య్ ఈ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నారు. సంప‌త్ రాజ్‌, ర‌వి శంక‌ర్‌, ప‌విత్రా లోకేష్ త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విజ‌య్ మిల్ట‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్యాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత స‌న్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు