సినిమాల్ని నిర్మించడమే కాదు మంచి కథా బలమున్న చిన్న సినిమాలకి సైతం నిర్మాత దిల్ రాజు తన వంతు సహకారం అందిస్తూ స్వయంగా విడుదల చేస్తుంటారు. ఇప్పటికే పలు చిన్న సినిమాలను విడుదల చేసిన ఆయన తాజాగా మరొక చిత్రం ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ను కూడా రిలీజ్ చేయనున్నారు.
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాకేష్ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రాన్ని బసవ శంకర్ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రాన్నే శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై దిల్రాజు అక్టోబర్ 8న విడుదల చేస్తున్నారు. ఇలా దిల్ రాజు కొత్త దర్శకులను, నటీ నటుల్ని నిత్యం ప్రొత్సహిస్తూ ఉండటం నిజంగా హర్షించదగిన విషయం.