తన మొదటి సినిమా ‘చి.ల.సౌ’తోనే మంచి హిట్ అందుకున్నాడు రాహుల్ రవీంద్రన్. పైగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది ఆ సినిమా. కానీ తన రెండో చిత్రంగా కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన మన్మథుడు 2 బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. అయినా దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ కు మంచి పేరే వచ్చింది. కాగా ప్రస్తుతం తన వెబ్ సిరీస్ కోసం కొత్త స్క్రిప్ట్ను పూర్తి చేసే దిశలో ఉన్నాడు రాహుల్.
స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందట. ఈ వెబ్ సిరీస్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ తో పాటు వెన్నెల కిశోర్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం ఒరిజినల్ వెబ్ సిరీస్ గా ఈ వెబ్ సిరీస్ ను తీయబోతున్నాడు రాహుల్. అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం డైరెక్టర్ గా బిజీ అవుతుండటం విశేషం.