సెకండ్ షెడ్యూల్ ఎండింగ్ లో ‘డిస్కోరాజా’ !

సెకండ్ షెడ్యూల్ ఎండింగ్ లో ‘డిస్కోరాజా’ !

Published on Jun 2, 2019 4:43 PM IST

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజా”. హైదరాబాద్ లో అల్యూమినీయం ఫ్యాక్ట‌రీలో భారీగా వేసిన‌ సెట్ లో ఇటీవ‌లే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో హీరో, విలన్ ల మ‌ధ్య యాక్షన్ స‌న్నివేశాలను చిత్రీక‌రించారు.

కాగా మరో రెండు రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు