యువ దర్శకుడు తరుణ్భాస్కర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది ?’. ఇప్పుడు ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకొని ‘U/A’ సర్టిఫై తో ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రంలో నటించిన విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకుమాను, అభినవ్ గోమటంలు అందరూ కొత్తవారే కావడం విశేషం. అయినా ప్రేక్షకుల్లో ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి.
తరుణ్ భాస్కర్ మేకింగ్ శైలిలోనే ఈ చిత్రంలో కూడా స్నేహితుల మధ్య జరిగే సరదా సంఘటనలు, వారి మధ్య పుట్టే, ప్రేమ దాని తాలూకు సంఘర్షణ వంటి అంశాలే ప్రధానంగా ఉంటాయని సమాచారం. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది.