ఎవరు, రణరంగం యూఎస్ కలెక్షన్స్ రిపోర్ట్…!

ఎవరు, రణరంగం యూఎస్ కలెక్షన్స్ రిపోర్ట్…!

Published on Aug 17, 2019 9:40 AM IST

శర్వానంద్ నటించిన రణరంగం, అడివి శేషు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎవరు చిత్రాలు స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈనెల 15న విడుదల కావడం జరిగింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎవరు మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా, రణరంగం చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. భారత దేశ చిత్రాలకు అతిపెద్ద ఓవర్సీస్ మార్కెట్ అయిన యూఎస్ లో ఈ రెండు చిత్రాల కలెక్షన్స్ రిపోర్ట్స్ ఇలా ఉన్నాయి.

ఎవరు చిత్రం యూఎస్ లో బుధవారమే ప్రీమియర్స్ ద్వారా $61,499 గ్రాస్ వసూళ్లు సాధించి ఆశ్చర్య పరిచింది. హీరో అడివి శేషు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా నిలిచింది. ఇక గురువారం ఈ మూవీ $43,320 గ్రాస్ సాధించిందని సమాచారం. తాజాగా అందిన రిపోర్ట్ ప్రకారం ఇప్పటివరకు ఎవరు చిత్రం యూఎస్ లో $1,21,822 గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తుంది.

ఐతే శర్వా రణరంగం పరిస్థితి యూఎస్ లో ఏమంత ఆశాజనకంగా లేదు. యూఎస్ ప్రీమియర్స్ లేకపోవడం ఈ మూవీ వసూళ్లపై తీవ్రప్రభావం చూపింది. గురువారం ఈ మూవీ $24,014 గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక తాజాగా అందిన లెక్కల ప్రకారం ఇప్పటివరకు రణరంగం ఆశ్చర్యకరంగా కేవలం $27,892 గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టినట్టు తెలుస్తుంది. ఐతే తెలుగురాష్ట్రాలలో మాత్రం ఈ మూవీ వసూళ్లు పర్వాలేదనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు