రజని,ఎన్టీఆర్, ప్రభాస్ కే కాదు, అడివి శేషుకు కూడా…!

రజని,ఎన్టీఆర్, ప్రభాస్ కే కాదు, అడివి శేషుకు కూడా…!

Published on Sep 14, 2019 4:40 PM IST

ప్రేమ, అభిమానానికి ఖండాంతరాలు, భాషా బేధాలు ఉండవు. అందుకే ముఖ్యంగా సినీ తరాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులుంటారు. విషయంలోకి వెళితే హీరో అడివి శేషు ఇటీవల ఎవరు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రం చూడడానికి అడివి శేషు అభిమానులు, ఏకంగా జపాన్ నుండి ఇండియా వచ్చారు. రీనా అనే పేరు గల ఓ మహిళా అభిమానితో పాటు అకికో అను మరొకతను వచ్చి అడివి శేషుని కలవడం జరిగింది.

ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అడివి శేషు వారితో గడిపిన సమయాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో పాటు, వారి అభిమానానికి కృతఙ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా జపాన్ లో తెలుగు హీరోలలో ఎన్టీఆర్, రజని కాంత్ కి అభిమానులు కలరు. బాహుబలి తరువాత ప్రభాస్ కి అక్కడ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కొద్దిరోజుల క్రితం కొందరు జపాన్ మహిళలు ప్రభాస్ ఇంటి ముందు నృత్యాలు చేసి, ఆయనను కలవడం జరిగింది. తాజా ఈ లిస్ట్ లోకి యంగ్ హీరో అడివి శేషు కూడా చేరారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు