నేటి అర్ధరాత్రి నుంచే “జీ5″లోకి వచ్చేస్తున్న “గాలివాన”..!

నేటి అర్ధరాత్రి నుంచే “జీ5″లోకి వచ్చేస్తున్న “గాలివాన”..!

Published on Apr 13, 2022 6:53 PM IST

ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో మనసులను తాకే కథలను చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఓటీటీ వేదిక జీ 5. కేవలం ఒక్క జాన‌ర్‌కు మాత్రమే ప‌రిమితం కాకుండా అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్‌లతో జీ5 వీక్షకుల మనసులు దోచుకుంటోంది. ఈ క్రమంలోనే బిబిసి స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ భాగ‌స్వామ్యంతో బిబిసి స్టూడియోస్ నిర్మించిన ఒక యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన‌’ అనే ఒరిజినల్ సిరీస్‌ను నిర్మించింది.

గాలివాన వెబ్‌సిరీస్‌లో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, హీరో సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చాందినీ చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, తాగుబోతు రమేష్, జ్యోతి ప్రదీప్, ఆశ్రిత వేముగంటి ఇతర తారాగణం. కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఇటీవల విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 నుంచి గాలివాన జీ5 లో స్ట్రీమింగ్ కాబోతుందని ముందుగానే మేకర్స్ ప్రకటించారు. అయితే నేడు అర్ధరాత్రి నుంచే ఎక్స్‌క్లూజివ్‌గా ఈ సిరీస్ జీ5లోకి రాబోతుందని తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు