సెన్సార్ పూర్తి చేసుకున్న “గం గం గణేశా”

సెన్సార్ పూర్తి చేసుకున్న “గం గం గణేశా”

Published on May 24, 2024 10:46 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ బేబీ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తదుపరి గం గం గణేశా చిత్రం లో కనిపించనున్నారు. మే 31, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ ను ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయికగా నటిస్తుండగా, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి మరియు వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు