కేరళ కోసం గీత గోవిందం నిర్మాత కీలక ప్రకటన !

కేరళ కోసం గీత గోవిందం నిర్మాత కీలక ప్రకటన !

Published on Aug 16, 2018 5:42 PM IST

అర్జున్ రెడ్డి ఫెమ్ విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ నిన్న విడుదలై మంచి వసూళ్లను సొంతం చేసుకుంటుంది. ఇక ఈ చిత్రం కేరళలోకూడా విడుదలైయింది. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కేరళలోని జన జీవనం అస్తవ్యస్తంగా తయారైయింది . ఇప్పటికే సిని ప్రముఖులు సైతం పెద్ద మొత్తం లో విరాళాలను ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పుడు తాజాగా వరద బాధితులకోసం గీత గోవిందం నిర్మాత బన్నీ వాసు విరాళం ను ప్రకటించాడు. కేరళలో ఈ చిత్రం ఎంత షేర్ ను రాబడుతుందో అంత మొత్తాన్ని కేరళ వాసులకోసం డొనేట్ చేస్తానని ప్రకటించారు. ఇక ఈ చిత్ర హీరో విజయ్ దేవరకొండ కూడా 5లక్షల రూపాయలను ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి విరాళం గా ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు