రష్మికా ‘గీతా ఛలో’ ఆడియో విడుదల !

రష్మికా ‘గీతా ఛలో’ ఆడియో విడుదల !

Published on Apr 18, 2019 9:51 AM IST

గోల్డెన్‌స్టార్ గణేశ్, రశ్మిక మందన్నా జంటగా నటించిన కన్నడ చిత్రం చమక్. ఈచిత్రాన్ని ఇప్పుడు ‘గీతా… ఛలో’. వీకెంట్ పార్టీ అనేది ట్యాగ్‌లైన్. పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రాన్ని శ్రీ రాజేశ్వరి ఫిల్మ్ పతాకంపై డి.దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం ఆడియో వేడుకను రామానాయుడు స్టుడియోలో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్, సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, నిర్మాతలు వీఎన్ ఆదిత్య, శ్రీధర్‌రెడ్డి, సుదర్శన్, బాలాజీ నాగలింగం తదితర ప్రముఖులు హాజరై పాటలను ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సి. కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘మామిడాల శ్రీనివాస్‌ది ఎప్పుడూ పోరాటమే. కానీ ఇంకో శ్రీనివాస్‌తో కలిసి ఈ రోజు ఒక మంచి సినిమా చేశారు. ఫైర్‌బ్రాండ్ హీరోయిన్ రశ్మిక మందన్నా ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశం. ‘గీతా.. ఛలో’ టైటిల్ కూడా క్యాచీగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా రిచ్‌లుక్ ఉంది. కన్నడలో కంటే ఇక్కడ ఇంకా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే హీరోయిన్‌ రశ్మికకు ఇక్కడ అంత మంచి మార్కెట్ ఉంది.’’ అన్నారు.

మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘మా గురువు కల్యాణ్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి మేము చాలా కష్టపడ్డాం. కన్నడలో ఈ సినిమా రూ. 30 కోట్లు వసూలు చేసింది. గీతాగోవిదం సినిమాలో ఎలాంటి ఎమోషన్స్, కామెడీ ఉందో ఈ సినిమాలో కూడా అలాంటివి ఉన్నాయి. ఇది యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా బాగా నచ్చుతుంది. ఈ నెల 26న విడుదల అవుతుంది. అందరూ తప్పక చూడండి.’’ అన్నారు.

దుగ్గివలస దివాకర్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాను రీమేక్ చేద్దామని అనుకున్నాం. అయితే రశ్మిక ఇప్పుడు స్టార్ హీరోయిన్ కాబట్టి రీమేక్ సినిమాలో చేయదని, ఆమె తప్ప ఈ సినిమాలో ఎవరూ సూట్ అవ్వరని డబ్ చేస్తున్నాం. ఈ సినిమాలో యూత్‌ను ఆకట్టుకునే అన్ని అంశాలూ ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఇది బాగా నచ్చుతుంది. ఈ నెల 21న విశాఖలో ప్రీ రిలీజ్ వేడుక కూడా చేస్తున్నాం. తర్వాత 26న సినిమాను విడుదల చేస్తున్నాం. అందరూ తప్పక చూసి ఆదరించాలని కోరుకుంటున్నా.’’ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు