గీత గోవిందం కృష్ణా షేర్ అదిరిపోయింది !

గీత గోవిందం కృష్ణా షేర్ అదిరిపోయింది !

Published on Aug 22, 2018 9:40 AM IST

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. ఆగస్టు 15న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈచిత్రానికి వేరే చిత్రాల నుండి పోటీ లేకపోవడంతో అంచలనాలకు మించి వసూళ్లను సాధిస్తుంది.

ఇక ఆంధ్ర లోని కృష్ణా జిల్లాలో గీత గోవిందం జోరు మాములుగా లేదు. విడుదలైన రోజు నుండి అక్కడ అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతుంది. ఇక 7వరోజు అక్కడ రూ. 15,39,538 లక్షల షేరును రాబట్టి వారం రోజులకుగాను రూ. 2,09,55,890 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈచిత్రాన్ని గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు