అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ‘మహానటి’

అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ‘మహానటి’

Published on Jun 2, 2018 5:33 PM IST


గత మే నెల 9వ తేదీన విడుదలైన ‘మహానటి’ చిత్రం మొదటిరోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని విడుదలైన అన్ని ఏరియాల్లోను బ్రహ్మాండమైన రన్ కనబర్చి పంపిణీదారులకు భారీ లాభాల్ని తెచ్చి పెడుతోంది. సినిమా విడుదలై ఇప్పటికి 24 రోజులు కావొస్తున్నా థియేటర్లు ప్రేక్షకులతో నిండుతున్నాయి.

ఇక నిన్న శుక్రవారం విడుదలైన మూడు సినిమాల్లో విశాల్ ‘అభిమన్యుడు’ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా నాగార్జున, ఆర్జీవీల ‘ఆఫీసర్’, రాజ్ తరుణ్ యొక్క ‘రాజుగాడు’ చిత్రాలు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ప్రేక్షకులు ‘మహానటి’ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో సినిమా ఇంకొన్ని రోజులు పెద్దగా ఇబ్బంది లేకుండా నడవనుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేనాటికి రూ.40 కోట్ల వరకు వసూలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు