ఆ జిల్లాలో’గూఢచారి’ బాగానే రాబడుతున్నాడు !

ఆ జిల్లాలో’గూఢచారి’ బాగానే రాబడుతున్నాడు !

Published on Aug 15, 2018 9:00 PM IST


క్షణం తరువాత అడివి శేష్ నటించిన చిత్రం’ గూఢచారి’. ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అదిరిపోయే కలెక్షన్స్ ను రాబడుతూ బ్లాక్ బ్లస్టర్ విజయం వైపు దూసుకుపోతుంది. స్పై త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కృష్ణా జిలాల్లో 12 వ రోజు రూ.1,66,724 లక్షల షేరు ను రాబట్టి ఇప్పటివరకు అక్కడ రూ. 59, 23,769 లక్షలను కలెక్ట్ చేసింది. ఇక దేశ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.10 కోట్ల వసూళ్లను రాబట్టిందని సమాచారం.

ఈ చిత్రం ఇండియాలోనే కాకుండా అటు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను సాధిస్తుంది. అభిషేక్ పిక్చర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సుప్రియ ముఖ్య పాత్రలో నటించారు. శశి కిరణ్ టిక్క తెరకెక్కించిన ఈచిత్రంలో శోభిత దూళిపాళ్ల కథనాయికగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు