హిట్లు లేని హీరో హీరోయిన్ చేతులు కలిపారు.. మరి విజయం వరిస్తుందా ?

హిట్లు లేని హీరో హీరోయిన్ చేతులు కలిపారు.. మరి విజయం వరిస్తుందా ?

Published on Jun 23, 2018 9:39 PM IST

జూలై నెలలో విడుదలకానున్న చిత్రాల్లో ‘పంతం’ కూడ ఒకటి. 5వ తేదీన ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా ఫలితం హీరో గోపిచంద్, హీరోయిన్ మెహ్రీన్ ప్రిజాదల ఇద్దరి భవిష్యత్తును నిర్ణయించనుంది. చివరగా ‘లౌక్యం, జిల్’ సినిమాలతో పర్వాలేదనిపించుకున్న హీరో గోపిచంద్ ఆ తరువాత ‘సౌఖ్యం, గౌతమ్ నంద, ఆక్సిజన్’ వంటి పరాజయాలతో నిరుత్సాహపరిచారు. ఈ ఫ్లాపుల వలన ప్రేక్షకులకు సైతం ఆయన సినిమాల పై ఆసక్తి కొంత సన్నగిల్లింది. కాబట్టి త్వరలో రాబోయే ‘పంతం’ సినిమాతో ఆయన ఆడియన్సుని తప్పక మెప్పించాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఇక ‘మహానుభావుడు, రాజా ది గ్రేట్’ సినిమాలతో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరుతుందనుకున్న కథానాయిక మెహ్రీన్ ఆ తరవాత ‘కేరాఫ్ సూర్య, జవాన్’ చిత్రాలతో బాగా వెనుకబడిపోయింది. ప్రేక్షకుల్లో ఆమె ఇమేజ్ కూడా కొంత తగ్గింది. ఆమె తిరిగి మరోసారి నిలదొక్కుకోని పెద్ద హీరోల సరసన అవకాశాలు అందుకోవాలంటే ‘పంతం’ విజయం ఆమెకు చాలా అవసరం.

మరి హిట్లులేని ఈ ఇద్దరికీ అగ్ని పరీక్షలాంటి ఈ సినిమా సత్పలితాన్ని అందించి ఊరటనిస్తుందో లేదో చూడాలి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రా న్ని నూతన దర్శకుడు కె.చక్రవర్తి తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు