గోపిచంద్ ‘పంతం’తో తన మార్కెట్ నిలబెట్టుకునేలా ఉన్నాడు !

గోపిచంద్ ‘పంతం’తో తన మార్కెట్ నిలబెట్టుకునేలా ఉన్నాడు !

Published on Jun 25, 2018 7:35 PM IST

హీరో గోపిచంద్ వరుస పరాజయాలతో సతమతమవుతూ సరైన విజయం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. తాజగా గోపించంద్ నటించిన ‘పంతం’ చిత్రం జులై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మంచి అంచనాలనే క్రియేట్ చేయగా తాజగా విడుదల చేసిన ట్రైలర్ కూడా సినిమాపై నమ్మకాన్ని పెంచే విధంగా ఉంది. దీంతో ఈసారి గోపిచంద్ ‘లౌక్యం’ తర్వాత సంపాదించుకున్న మార్కెట్ ను ‘పంతం’తో నిలబెట్టుకునేలా కనిపిస్తున్నాడు.

ఈ ‘పంతం’ చిత్రంలో కొన్ని సామజిక అంశాలను ప్రస్తావించారు. అందులో భాగంగానే ట్రైలర్ లో ‘కురుక్షేత్రం యుగానికి ఒక్కసారే జరుగుతుంది. ధర్మం వైపు నిలబడాలా.. అధర్మం వైపు నిలబడాలా అనే నిర్ణయం ఇప్పుడే తీసుకోవాలి’ అని గోపించంద్ చేత డైలాగులు చెప్పించారు. ట్రైలర్ అయన అభిమానులను బాగా అలరిస్తోంది. ఐతే సినీవర్గాల సమాచారం ప్రకారం సినిమా బాగా వచ్చిందని, కొత్త దర్శకుడు అయినప్పటికీ చక్రవర్తి బాగానే తెరకెక్కించారని తెలుస్తోంది. మరి చూడాలి వీరి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు