అల్లి అర్జున్ సరసన ‘దేశముదురు’ చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది హన్సిక. ఆ తర్వాత కంత్రిలో ఎన్టీఆర్ తో, అలాగే మరికొంత బడా స్టార్స్ తో నటించినప్పటికీ హన్సిక తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ గా కొనసాగలేకపోయింది. ఆ దశలోనే తమిళ్ సినీపరిశ్రమకి వెళ్లి అక్కడ బాగానే బిజీ అయింది. కాగా ప్రస్తుతం హన్సిక 50వ సినిమా చేస్తుండటం విశేషం.
జమీల్ దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రగా ‘మహా’ చిత్రం రానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయిందట. సెప్టెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిచనున్నారు.