సుకుమార్ నిర్మాణంలో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది హెబ్బా పటేల్. ఆ సినిమా హిట్ కారణంగా హెబ్బాకు ఆ తరువాత బాగానే అవకాశాలు వచ్చాయి. కానీ వరుస ప్లాప్ లతో ఈ అమ్ముడికి ప్రస్తుతం ఛాన్స్ లు తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన సినిమానే ‘భీష్మ’. నితిన్ హీరోగా ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉపశీర్షిక. కాగా ఈ సినిమాలో హెబ్బా పటేల్ ఓ కీలక పాత్రలో కనిపించనుందని… ముఖ్యంగా హెబ్బా పాత్రలో ఎక్కువుగా నెగటివ్ షేడ్స్ ఉంటాయని, ఇక విధంగా ఈ సినిమాలో తను లేడీ విలన్ అని తెలుస్తోంది.
‘ఛలో’ మాదిరిగాగే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడట. ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలో హైలెట్ అవుతుందని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.