మరో మారు సాహసం కాంబినేషన్ లో

మరో మారు సాహసం కాంబినేషన్ లో

Published on Sep 13, 2019 10:10 PM IST

యాక్షన్ హీరో గోపీచంద్‌ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ తన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మిస్తుండగా, ఈ చిత్ర షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.నూతన దర్శకుడు బిను సుబ్రమణ్యం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సతీశ్ కురుప్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు. ఈచిత్ర ఇతర నటీనటులు,సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. గతంలో గోపీచంద్ బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సాహసం చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

కాగా గోపిచంద్ తాజా చిత్రం చాణక్య దసరా కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా, దర్శకుడు తిరు యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాడు. మెహ్రీన్ గోపి చంద్ కి జంటగా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు