ఎమోషనల్ సన్నివేశాల్లో యంగ్ హీరో !

‘ఛ‌లో’ లాంటి చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో రమణ తేజ దర్శకత్వంలో వ‌స్తున్న చిత్రం.. ఇప్పటికే సినిమాలోని కీలకమైన భాగం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ఎమోషనల్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ సమయంలో నాగశౌర్య ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయినా నాగశౌర్య త్వరగా కోలుకొని మొత్తానికి ఈ సినిమాని పూర్తి చేస్తున్నాడు.

ఇక నిర్మాత ఉషా ముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఈ చిత్రంలో నాగ‌శౌర్య సరసన హీరోయిన్ గా మెహరీన్ నటిస్తుంది. ‘ఎఫ్ 2’ తరువాత మెహరీన్ చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. మొత్తానికి మెహ‌రిన్ హీరోయిన్ గా మ‌రోసారి ప్రేక్ష‌కుల అలరించబోతుంది. పోసాని కృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీ‌చ‌ర‌ణ్‌, కెమెరా మ‌నోజ్‌ రెడ్డి, ఎడిట‌ర్‌ గారీ బిహెచ్‌, డైరెక్ష‌న్ ర‌మ‌ణ్‌ తేజ‌, ప్రొడ్యూస‌ర్ ఉషా ముల్పూరి,

Exit mobile version