లాక్ డౌన్ కష్టాలు సామాన్యులకు కాదు సెలబ్రిటీలకు కూడా సమానమే.అందుకు నిదర్శనమే మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ వ్యవహారం. కొద్దిరోజుల క్రితం ‘ఆడు జీవితం’ షూటింగ్ నిమిత్తం హీరో పృథ్వీరాజ్ తో పాటు కొద్దిమందితో కూడిన చిత్ర యూనిట్ ఎడారి దేశం జోర్డాన్ వెళ్లారు. వీరు అక్కడ చేరుకున్న తరువాత వరల్డ్ వైడ్ గా లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. లాక్డౌన్ క్రమంగా పొడిగిస్తూ వచ్చారు. ఈ కారణంగా చిత్ర యూనిట్ దాదాపు రెండు నెలల పాటు జోర్డాన్లో ఉండిపోయారు.
ఆ సమయంలో హీరో పృథ్వీరాజ్ తన ట్విట్టర్ ద్వారా తాము జోర్డాన్లో ఎదుర్కొంటోన్న సమస్యలను తెలియజేశారు. తమ యూనిట్ను ఇండియాకు రప్పించాలని కేరళ సీఎం, ఫిల్మ్ ఛాంబర్కు లేఖ కూడా రాశారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించడంతో పృథ్వీరాజ్ సహా చిత్ర యూనిట్ ప్రత్యేక ఎయిరిండియా విమానంలో ఇండియా చేరుకున్నారు. దీంతో అభిమానులు, కుటుంబ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.