కథాపరంగా అవే ముఖ్యం మిగతావి పట్టించుకోను – నారా రోహిత్

కథాపరంగా అవే ముఖ్యం మిగతావి పట్టించుకోను – నారా రోహిత్

Published on Feb 13, 2013 1:11 PM IST

Nara-Rohith

నారా రోహిత్ హీరోగా నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించిన ‘ఒక్కడినే’ సినిమా గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న ఫైనాన్సియల్ ఇబ్బందులను తొలగించుకొని రేపు (ఫిబ్రవరి 14న) ప్రేక్షకుల ముందుకొస్తోంది. శ్రీనివాస్ రాగా డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి సి.వి రెడ్డి నిర్మించాడు. ప్రముఖ సింగర్ కార్తీక్ సంగీతం అందించాడు.

ఈ సందర్భంగా ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు చేసిన రెండు సినిమాలు సున్నితమైన కథలతో తెరకేక్కినవే ఇలాంటి తరహా సినిమాలే చేయడానికి గల కారణం ఏమిటనడదిగితే నారా రోహిత్ సమాధానమిస్తూ ‘ ఫలానా తరహా కథే అని ఆలోచించను అలా ఆలోచిస్తే లెక్కలు తారుమారైపోతాయి. నేను చేసే సినిమాల్లో సున్నితత్వం ఎంతవరకూ ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే ఆ సినిమా ప్రేక్షకుడికి వినోదాన్ని అందిస్తుందా? లేదా? ప్రేక్షకుడి మనసుకి చేరువవుతుందా? లేదా? అనేది మాత్రమే చూస్తాను. మిగతా విషయాలను పట్టించుకోనని’ అన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు