ఇకపై కూడ కొత్తదనాన్ని, ప్రయోగాల్ని ట్రై చేస్తానంటున్న చరణ్ !


ఇటీవల విడుదలైన ‘రంగస్థలం’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రూ.200 కోట్లకు పైగానే గ్రాస్ రాబట్టిన ఈ చిత్రంతో తెలుగు సినిమా ప్రేక్షకులు కొత్తదనాన్ని, ప్రయోగాల్ని ఎంతలా ఆదరిస్తారో నిరూపితమైంది. ఈ సక్సెస్ గురించి ప్రముఖ మీడియాతో మాట్లాడిన చరణ్ సక్సెస్ ఇచ్చిన ఒకే ఫార్ములాని మళ్ళీ మళ్ళీ ఫాలో అవకుండా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని, ప్రయోగాల్ని ట్రై చేస్తూ ఉంటానని అన్నారు.

అలాగే ఇప్పటి ప్రేక్షకులు కమర్షియాలిటీ పేరుతో బలవంతంగా పెట్టే అంశాలని మొహమాటం లేకుండా తిప్పికొడుతున్నారని, అందుకే నిజాయితీగా కష్టపడి పనిచేయాలని అన్నారు. అలాగే తను తన తండ్రి స్టైల్ ను ఫాలో అవకుండ తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉండేలా చూసుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా అది పూర్తవగానే రాజమౌళి మల్టీ స్టారర్ ను మొదలుపెట్టనున్నారు.

Exit mobile version