లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్న ఇళయరాజా

లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్న ఇళయరాజా

Published on Jan 20, 2015 7:10 PM IST

ilayaraja
ప్రముఖ సంగీత దర్శకుడు, మాస్ట్రో ఇళయరాజా ఈ రోజు రాత్రి ముంబైలో జరిగే ఓ కార్యక్రమంలో లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. 1000 సినిమాలకు సంగీతం అందించిన సందర్భంలో ఈ వేడుక జరగనుంది. అమితాబ్ బచ్చన్, ధనుష్ నటించిన ‘షమితాబ్’ చిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇళయరాజా స్వరపరిచిన చిరస్మరణీయమైన సుమధుర బాణిలను మరోసారి గుర్తు చేయనున్నారు. ఇదే వేదికపై ‘షమితాబ్’ ఆడియోను విడుదల చేయనున్నారు.

అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, కమల్ హాసన్, శ్రుతి హాసన్ తదితర ప్రముఖులు ఈ లైవ్ కన్సర్ట్ కు హాజరుకానున్నారు. ముంబైలో లైవ్ కన్సర్ట్ తర్వాత చెన్నై, ఢిల్లీ నగరాలలో కూడా ఇళయరాజా లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత బాల దర్శకత్వం వహిస్తున్న ‘తారై తప్పట్టై’ సినిమా ఇళయరాజా సంగీతం అందించిన 1000వ సినిమా.

తాజా వార్తలు