మహర్షి తదుపరిషెడ్యూల్ గురించి ఆసక్తికరమైన వార్త !

మహర్షి తదుపరిషెడ్యూల్ గురించి ఆసక్తికరమైన వార్త !

Published on Nov 4, 2018 10:37 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం యూఎస్ లో జరుగుతుంది. ఇక ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ హైద్రాబాద్లో జరుగనుంది. ఒక ప్రముఖ స్టూడియోలో వేసిన విలేజ్ సెట్ లో ఈ షెడ్యూల్ దాదాపుగా 25 రోజుల పాటు జరుగనుందని సమాచారం.

ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు తో పాటు అల్లరి నరేష్ కూడా పాల్గొననున్నాడు. రిచ్ బిజినెస్ మేన్ ఆయిన రిషి (మహేష్ ) తన క్లాస్ మెట్ అయిన రవి (అల్లరి నరేష్ ) ను కలవాడిని ఆ ఊరికి వస్తాడట ఆ తరువాత వచ్చే కథనం చాలా ఆసక్తిగా వుంటుందట. సినిమాకు ఈ ఎపిసోడ్ కీలకం కానుందని సమాచారం.

పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. ఇక మహేష్ నటిస్తున్న ఈ 25వ చిత్రం భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 5న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు