మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అరవింద సమేత కోసం తన మేకింగ్ స్టైల్ ను, తన రైటింగ్ స్టైల్ ను పూర్తిగా మార్చికొని పని చేస్తుండగా, ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తరువాత తన మాస్ ఇమేజీకి తగ్గట్లుగా పూర్తి యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసిన విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమాకు సంబంధించిన రెండో టీజర్ ను కూడా వినాయక చవితి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు పై చిత్రబృందం తాజాగా ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ‘అరవింద సమేత’కు సంబంధించిన ఫస్ట్ టీజర్ బ్లాక్బస్టర్గా నిలిచింది. రెండో టీజర్ కూడా రాబోతోందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇక త్వరలోనే ఈ చిత్ర నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనుంది’ అని పేర్కొంది.
రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.