లెజెండరీ దర్శకుడు కళా తపస్వి కె.విశ్వనాథ్ బయోపిక్ని ‘విశ్వదర్శనం’ అనే టైటిల్ తో తెరకెక్కించబోతున్నారు దర్శక రచయిత జనార్థన మహర్షి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించనున్నారు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ బయోపిక్ ను ఓ డాక్యుమెంటరీగా రూపొందించాలని దర్శక నిర్మాతలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
మరి ఈ డాక్యుమెంటరీ టైపు చిత్రాలు అంతగా అలవాటు లేని తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. ఇంతకీ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే విశ్వనాధ్ గారి పాత్రను పోషించే నటుడి కోసం కూడా చిత్రబృందం అన్వేషిస్తుంది. ఇద్దరు ముగ్గురి నటులను పేర్లను పరిశీలిస్తున్నప్పటికీ ఇంకా ఎవర్ని ఫైనల్ చెయ్యలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.