అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ మూవీ పోస్ట్ ఫోన్ అయ్యిందా?

అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ మూవీ పోస్ట్ ఫోన్ అయ్యిందా?

Published on Sep 14, 2019 8:24 PM IST

ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేస్తున్న అల వైకుంఠపురంలో చిత్ర షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ చిత్రం తరువాత మరో రెండు చిత్రాలు లైన్ లో పెట్టారు బన్నీ. అందులో ఒకటి సుకుమార్ చిత్రం కాగా మరొకటి దర్శకుడు వేణు శ్రీరామ్. ఐతే బన్నీ ఈ రెండు చిత్రాలను ఏక కాలంలో పూర్తి చేయాలని భావించారు.

ఐతే తాజా సమాచారం ప్రకారం వేణు శ్రీరామ్ చిత్రం వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నారట బన్నీ. అల వైకుంఠపురంలో షూటింగ్ ముగిసిన వెంటనే ఆయన గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించనున్న చిత్రంలో నటించాలని భావిస్తున్నారట. మరి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు