మల్టీ స్టారర్ కోసం దిల్ రాజుకు హీరోలు దొరికారా ?

మల్టీ స్టారర్ కోసం దిల్ రాజుకు హీరోలు దొరికారా ?

Published on Jul 16, 2018 10:40 PM IST

ప్రముఖ నిర్మాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు మరో మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలిసిందే. ఇటీవల ‘సమ్మోహనం’ చిత్రం తో వరుస విజయాలను అందుకున్న దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రంలో నాని , శర్వానంద్ లు కథానాయకులుగా నటిస్తారని చిత్ర వర్గాల నుండి సమాచారం అందుతుంది.

అయితే ఈ వార్తలు నిజమో కాదో త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. ఇంతకుముందు దిల్ రాజు ,నాని తో ‘నేను లోకల్ , ఎమ్ సి ఏ’ చిత్రాలను అలాగే శర్వానంద్ తో ‘శతమానం భవతి’ చిత్రాలు నిర్మించారు. మూడు చిత్రాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు ఆయన ఈమల్టీ స్టారర్ చిత్రానికి కూడా వీరిద్దరైతే బాగుంటుందని అనుకుంటున్నారట. యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం యొక్క వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు