జగపతి బాబు విషయంలో క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ !

జగపతి బాబు విషయంలో క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ !

Published on Jul 19, 2019 2:42 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుండి సీనియర్ హీరో జగపతి బాబు తప్పుకోవడానికి కారణం.. తన పాత్ర పట్ల సంతృప్తి చెందకపోవడమే అని సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయం పై ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేస్తూ.. ‘జగపతి బాబుగారు ‘సరిలేరు నీకెవ్వరు’లో నటించడానికి చాల ఆసక్తి చూపారు. ఈ సినిమాలో ఆయన తన పాత్రను ప్రేమించారు కూడా. అయితే కొన్ని కారణాల వల్ల.. ఆయన ఈ సినిమాలో నటించడం లేదు. కానీ భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో జగపతి బాబుగారు మమ్మల్ని అర్ధం చేసుకున్నందుకు కృతజ్ఞతలు అని అనిల్ రావిపూడి పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం కాశ్మీర్ లో రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ కాశ్మీర్ షెడ్యూల్ లో మహేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ అలాగే కొంతమంది ముఖ్య తారాగణం కూడా పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించే సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు