‘కరుప్పు’ చిత్రంతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న స్టార్ హీరో సూర్య, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించాడు. సూర్యకు ‘జై భీమ్’ వంటి సంచలన హిట్ అందించిన దర్శకుడు టి.జె. జ్ఞానవేల్తో మరోసారి చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాడు. సూర్య కెరీర్లో 48వ చిత్రాన్ని ఈ డైరెక్టర్ తెరకెక్కించనున్నాడు. ఒక నిజ జీవిత వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఈ సినిమాలో సూర్య సరసన కయాదు లోహర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలతో నటించిన ఆమెకు, ఒక టాప్ స్టార్ సరసన నటిస్తున్న తొలి సువర్ణ అవకాశం ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తుండగా, ఎస్.ఆర్.కతీర్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నాడు.


