‘జంబ లకిడి పంబ’ హీరోయిన్ కోసం 36 మందిని ఆడిషన్ చేశారట !

‘జంబ లకిడి పంబ’ హీరోయిన్ కోసం 36 మందిని ఆడిషన్ చేశారట !

Published on Jun 18, 2018 6:14 PM IST

నటుడు శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘జంబ లకిడి పంబ’. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘జంబ లకిడి పంబ’ సినిమా పేరుతోనే ఈ చిత్రం వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై కొంత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డికి జోడీగా సిద్ది ఇద్నాని నటించారు.

కథ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ ఒక దశలో పురుషుడి బాడీ లాంగ్వేజ్ తో నటించాల్సి ఉంటుంది. ఇలాంటి క్లిష్టమైన, కీలకమైన పాత్ర కోసం నటిని సెలక్ట్ చేసేందుకు నిర్మాతలు సుమారు 36 మందిని ఆడిషన్స్ చేశారట. ఆ 36 మంది నుండి చివరికి సిద్ది ఇద్నానిని ఫైనల్ చేశారట.

ఇక సిద్ది ఇద్నాని కూడా అంత పోటీని తట్టుకుని చేజిక్కించుకున్న పాత్రకు పూర్తిగా న్యాయం చేసినట్టు తెలుస్తోంది. ట్రైలర్లో ఎక్కువసేపు కనిపించే ఆమె పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాకే వస్తోంది. జె.బి.మురళి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని జూన్ 22వ తేదీన విడుదలచేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు