తలైవి డిజిటల్ రైట్స్ కి అన్ని కోట్లు పెట్టారా?

తలైవి డిజిటల్ రైట్స్ కి అన్ని కోట్లు పెట్టారా?

Published on Jun 5, 2020 4:12 PM IST

తమిళ రాజకీయ సంచలనం, ప్రజల అమ్మ జయలలిత జీవితంలో సినిమాకు మించిన నాటకీయ పరిణామాలు ఉన్నాయి. దీనితో ఆమె మరణించిన వెంటనే చాలా మంది బియోపిక్స్ తీయడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ రమ్య కృష్ణతో క్వీన్ అనే ఓ వెబ్ సిరీస్ తీశారు. అలాగే నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో ఓ బయోపిక్ తెరకెక్కుతుంది. వీటన్నిటికీ మించి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న చిత్రం తలైవి.

దర్శకుడు ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో జయలలితగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ఏకంగా రూ. 55 కోట్లకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందట. అన్ని భాషల హక్కులకు కలిపి వారు ఇంత మొత్తానికి ఒప్పదం చేసుకున్నారట. అది కూడా థియేటర్స్ విడుదల తరువాత ప్రసార హక్కులు ఇచ్చారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు