తెలుగు రాష్ట్రాల్లో “కాంతార” సెన్సేషన్!

తెలుగు రాష్ట్రాల్లో “కాంతార” సెన్సేషన్!

Published on Nov 1, 2022 2:18 AM IST


రిషబ్ శెట్టి హీరోగా నటించడం మాత్రమే కాకుండా రచించి, దర్శకత్వం వహించిన విలేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కాంతార. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి మౌత్ టాక్ తో స్టార్ట్ అయిన ఈ చిత్రం 16 వ రోజు కూడా షాకింగ్ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం నిన్న తెలుగు రాష్ట్రాల్లో మరో కోటి రూపాయలకి పైగా షేర్ ను రాబట్టింది. దీంతో ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టిన చిత్రం గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

ఈ చిత్రం లో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా, అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. ప్రముఖ హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్ళను రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు