తెలుగులో “కాంతారా” సక్సెస్ టూర్ కి డేట్ ఫిక్స్..ల్యాండ్ అవ్వబోతున్న హీరో.!

తెలుగులో “కాంతారా” సక్సెస్ టూర్ కి డేట్ ఫిక్స్..ల్యాండ్ అవ్వబోతున్న హీరో.!

Published on Oct 28, 2022 2:00 PM IST

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా సప్తమి గౌడ హీరోయిన్ గా అలాగే రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “కాంతారా”. మరి మొదటగా కన్నడ లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ ని నమోదు చేసిన ఈ చిత్రం మిగతా భాషల్లో రిలీజ్ కాకుండానే హాట్ టాపిక్ అయ్యింది.

ఇక అలా నెక్స్ట్ మన తెలుగు సహా హిందీలో ఈ చిత్రం ఇప్పుడు మంచి వసూళ్లతో అదిరే రన్ ని కొనసాగిస్తోంది. ఇక తెలుగులో అయితే ఈ చిత్రాన్ని దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ తమ బ్యానర్ గీతా ఆర్ట్స్ పై రిలీజ్ చేయగా తెలుగులో కూడా భారీ సక్సెస్ ని ఈ చిత్రం అందుకోగా ఇప్పుడు మేకర్స్ అయితే తెలుగులో సినిమా అందుకున్న విజయానికి గాను సక్సెస్ మీట్ ని అయితే ప్లాన్ చేశారు.

మరి దీనిని ఓ టూర్ గా ప్లాన్ చెయ్యగా ఈ టూర్ లో హీరో రిషబ్ శెట్టి స్వయంగా తెలుగు స్టేట్స్ లో జాయిన్ అయ్యి పాల్గొననున్నాడట. మరి తెలుగులో అయితే ఈ 29న ఉదయం తిరుపతిలో జయ శ్యామ్ థియేటర్ నుంచి స్టార్ట్ చేసి మధ్యాహ్నం వైజాగ్ లో జగదాంబలో ఈ టూర్ షెడ్యూల్ కాగా థియేటర్స్ కి అయితే రిషబ్ చేరుకొని అభిమానులని కలవనున్నట్టు ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. మరి ఆ తర్వాత అయితే సింహాచలం చేరుకొని సింహాద్రి అప్పన్న ఆశీర్వాదం తీసుకోనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు