ఆహా లో కనులు కనులను దోచాయంటే..!

ఆహా లో కనులు కనులను దోచాయంటే..!

Published on Apr 24, 2020 9:00 PM IST

ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయం అందుకుంది కనులు కనులను దోచాయంటే. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు ప్రేక్షకుల ప్రశంశలు అందుకుంది. దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా దర్శకుడు దేసింగ్ పెరియస్వామి ఫన్ అండ్ రొమాన్స్ తో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించారు.

కాగా ఈ చిత్రం ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులోకి రానుంది. డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ఆహా ఈ చిత్ర డిజిటిల్ రైట్స్ దక్కించుకోగా త్వరలో ప్రేక్షకులకు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. లాక్ డౌన్ పీరియడ్ కావడంతో ఈ మూవీ విశేష ఆదరణ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. డబ్బింగ్ మూవీ కావడంతో ఈ మూవీపై చాలా మంది ఫోకస్ పెట్టలేదు. టాక్ ప్రేక్షకులకు చేరేలోపే థియేటర్స్ నుండి వెళ్ళిపోయిది. డిజిటల్ ఫార్మాట్ లో కనులు కనులను దోచాయంటే మంచి విజయం అందుకోవడం ఖాయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు