అతి త్వరలోనే అన్నయ్యతో కలిసి నటిస్తానంటున్న తమ్ముడు !

అతి త్వరలోనే అన్నయ్యతో కలిసి నటిస్తానంటున్న తమ్ముడు !

Published on Jun 13, 2018 9:54 PM IST


కార్తీ , సయేషా జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో తమిళ భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘కడైకుట్టి సింగం’. ఈ సినిమా ఆడియో లాంచ్ లో కార్తీ మాట్లాడుతూ అన్నయ్య సూర్యతో త్వరలోనే ఒక సినిమాలో నటించే అవకాశం ఉంది అని అన్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సూర్యనే నిర్మాత కావడం విశేషం తన సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు .

ఇక ఈ సినిమాలో కార్తీ రైతుల సమస్యల మీద పోరాడే పాత్రలో నటిస్తున్నాడు. సత్యరాజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాని శక్తి ఫిలిం ఫ్యాక్టరీ జులై రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు . ఈ చిత్రాన్ని స్వయంగా సూర్యనే నిర్మిస్తుండడం మరియు రైతుల సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతుండడంతో ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఉన్నాయి . ఈ సినిమాని తెలుగులో ద్వారకా క్రియేషన్స్ పతాకం ఫై మిర్యాల రవీందర్ రెడ్డి ‘చినబాబు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర తెలుగు వెర్షన్ ఆడియో ఇంకా విడుదల కావాల్సి వుంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు