నార్త్ లో దుమ్ము లేపుతున్న “కార్తికేయ 2”..!

నార్త్ లో దుమ్ము లేపుతున్న “కార్తికేయ 2”..!

Published on Aug 19, 2022 8:07 AM IST


యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ చిత్రం “కార్తికేయ 2”. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యి ఇప్పుడు భారీ హిట్ టాక్ తో తెలుగు సహా హిందీలో కూడా సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తుంది. మరి లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం నార్త్ బెల్ట్ లో సెన్సేషన్ ని నమోదు చేస్తుంది.

ఈ కృష్ణాష్టమి సమయానికి మొదటి రోజు జస్ట్ 50 స్క్రీన్స్ తో స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు ఆరో రోజుకి ఏకంగా 1000 స్క్రీన్స్ కి చేరుకొని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అంతే కాకుండా టోటల్ గా ఇప్పుడు ఈ చిత్రం 3000 షోస్ మార్క్ కి కూడా చేరుకొని బాలీవుడ్ సినిమా దగ్గర మినీ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది.. మొత్తానికి అయితే మళ్ళీ మన తెలుగు నుంచి పుష్ప, RRR తర్వాత అదిరే లెవెల్లో హిందీలో రాణిస్తున్న చిత్రంగా ఇది నిలిచింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు