సౌత్ ఈస్ట్ ఆసియాకు వెళ్లనున్న ‘కార్తికేయ – 2’ !

సౌత్ ఈస్ట్ ఆసియాకు వెళ్లనున్న ‘కార్తికేయ – 2’ !

Published on Jun 7, 2020 11:15 AM IST

అనేక దేశాలలో లాక్ డౌన్ కారణంగా కొనసాగుతున్న ప్రయాణ ఆంక్షలు ప్రపంచవ్యాప్తంగా ఉండటంతో చిత్రనిర్మాతలను కొన్ని నెలల పాటు విదేశీ షెడ్యూల్స్ ను రద్దు చేయాల్సి వస్తోంది. అయితే, కొంతమంది మేకర్స్ మాత్రం కథ డిమాండ్ ప్రకారం విదేశాలలో షూట్ చేయాలని నిశ్చయించుకుంటున్నారు. వారిలో ‘కార్తికేయ – 2’ మేకర్స్ కూడా ఉన్నారు.

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ – 2’ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని ప్రధాన భాగాన్ని కంబోడియాలో చిత్రీకరించనున్నారు. చందూ మరియు అతని బృందం సౌత్ ఈస్ట్ ఆసియా దేశానికి వెళ్లానున్నారు. షూట్ కోసం అవసరమైన అనుమతులు పొందటానికి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారు. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు