ఆ రోజున ఓటిటి ఆడియన్స్ ముందుకి రానున్న ‘కీడా కోలా’ ?

ఆ రోజున ఓటిటి ఆడియన్స్ ముందుకి రానున్న ‘కీడా కోలా’ ?

Published on Nov 29, 2023 10:17 PM IST


యువ దర్శకుడు త‌రుణ్ భాస్క‌ర్ దాస్యం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ కీలక పాత్ర‌లో న‌టించిన తాజా సినిమా కీడాకోలా. ఇటీవల నవంబర్ 3న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమా యావరేజ్ విజయం సొంతం చేసుకుంది. ఇందులో కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంశాలు ఆడియన్స్ ని ఆకట్టుకున్నప్పటికీ కాన్సెప్ట్ మాత్రం ఆడియన్స్‌కు పెద్దగా క‌నెక్ట్ కాలేక‌పోయింది.

ఇక కీడా కోలా సినిమాకి రానా ద‌గ్గుబాటి ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. కీడా కోలా సినిమాలో త‌రుణ్ భాస్క‌ర్‌తో పాటు చైత‌న్య‌రావు, రాగ్‌ మ‌యూర్‌, బ్ర‌హ్మానందం కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాలో టాక్సీవాలా విష్ణు, జీవ‌న్‌, ర‌వీంద్ర విజ‌య్ కీల‌క పాత్ర‌లు పోషించారు. విషయం ఏమిటంటే, తాజా టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ క్రైమ్ కామెడీ సినిమా ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా ఓటీటీలో డిసెంబ‌ర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. కాగా దీని పై త్వరలో అఫీషియల్ గా ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు