ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో కీర్తీ సురేష్.?

ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో కీర్తీ సురేష్.?

Published on Jul 16, 2020 11:12 PM IST

అప్పటి వరకు అందరి హీరోయిన్స్ లానే కెరీర్ ను నెట్టుకొస్తున్న కీర్తి సురేష్ కు “మహానటి” చిత్రంతో అతి పెద్ద బ్రేక్ వచ్చింది. దీనితో కీర్తి సురేష్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఒకపక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటుగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా కూడా మంచి రోల్స్ ఆమెకు ఇప్పుడు వస్తున్నాయి. ఆమె నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం పెంగ్విన్ భారీ అంచనాలతో వచ్చి నిరాశపర్చగా మరికొన్ని సినిమా ఓటిటి లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు కీర్తి ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అలిమేలు మంగ వెంకటరమణ” సినిమాలో గోపీచంద్ సరసన కీర్తి సురేష్ ఎంపిక అయ్యినట్టు ఇప్పుడు సమాచారం. ఇదిలా ఉండగా ఈ రోల్ కు చాలా మంది స్టార్ హీరోయిన్ ల పేర్లు మొదట వినిపించగా ఇప్పుడు కీర్తీ ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. మరి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు