మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సినీప్రముఖుల కీలకసమావేశం.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సినీప్రముఖుల కీలకసమావేశం.

Published on May 27, 2020 9:00 PM IST

మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశమైన మంత్రి శ్రీనివాస్ యాదవ్
నిర్మాతలు సి.కళ్యాణ్, దిల్ రాజు, డైరెక్టర్ ఎన్.శంకర్, మా అద్యక్షుడు నరేష్, ఎఫ్ డి సి మాజీ చైర్మన్ రాంమోహన్ రావు, జీవిత, పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు.లాక్ డౌన్ తో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్ లు నిలిచిపోయి ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది.

పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. షూటింగ్ లు, దియేటర్స్ ఓపెనింగ్ లకు సంబంధించి పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకుంటాం . ముఖ్యమంత్రి వద్ద సినీ ప్రముఖులతో ఇప్పటికే సమావేశం లో పలు అంశాలను చర్చించడం జరిగింది. తెలుగు సినీ పరిశ్రమకు బెస్ట్ పాలసీ ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తుంది. 28 వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీతో సినీ రంగంలోని పలు విభాగాలకు చెందిన ప్రముఖులతో సమావేశంలో పలు అంశాలను చర్చించడం జరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు