మెమొరబుల్ పిక్ : పవన్ కళ్యాణ్ తో ఖుషి డైరెక్టర్

మెమొరబుల్ పిక్ : పవన్ కళ్యాణ్ తో ఖుషి డైరెక్టర్

Published on Nov 3, 2022 1:28 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్ గా శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మాతగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక మూవీ ఖుషి. ఎస్ జే సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2001లో విడుదలై అప్పట్లో ఎంతో పెద్ద సెన్సేషనల్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్బ్ యాక్టింగ్, భూమిక అందచందాలు ఎస్ జే సూర్య అత్యద్భుత దర్శకత్వ ప్రతిభ నిర్మాత ఏ ఎం భారీ నిర్మాణ విలువలు, మణిశర్మ ఆకట్టుకునే సాంగ్స్, బిజిఎమ్ ఖుషి సినిమాని అప్పట్లో అంత పెద్ద సక్సెస్ చేశాయు.

అయితే విషయం ఏమిటంటే నేడు దర్శకుడు ఎస్ జే సూర్య ఖుషి షూటింగ్ విరామ సమయంలో పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఒక బ్యూటిఫుల్ మెమొరబుల్ పిక్ ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు. ఆ పిక్ లో స్టైలిష్ గా కళ్లద్దాలు పెట్టుకొని కూర్చొని ఉన్న పవర్ స్టార్ పక్కన నిలబడి ఉన్న ఎస్ జే సూర్య ని గమనించవచ్చు. ప్రస్తుతం ఈ మెమొరబుల్ పిక్ మీడియా మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు