నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేష్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.47గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి..ది క్రికెటర్’. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. జూన్లో చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామరావు మాట్లాడుతూ ”తండ్రీకూతుళ్ళ మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం, వాత్సల్యాన్ని చాటి చెప్పే సినిమా ఇది. క్రికెట్ బ్యాక్డ్రాప్ ఈ సినిమాలో ఉన్న నావెల్టీ. ఫిమేల్ క్రికెటర్గా ఐశ్వర్యా రాజేష్ ఎలా విజయం సాధించింది? తండ్రికి, దేశానికి ఎంత పేరు తెచ్చింది అనేది ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తం. ఒక మంచి కథతో, పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. జూన్ మూడోవారంలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.
దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ”లేడీ క్రికెటర్ కథాంశంతో వస్తున్న విభిన్న చిత్రం. ఒక మంచి సబ్జెక్ట్తో, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో విలేజ్ బ్యాక్డ్రాప్లో చేసిన ఈ చిత్రం అన్నివర్గాల ఆడియన్స్ని అలరిస్తుంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ కథలో రైతుల సమస్యలను కూడా టచ్ చేయడం జరిగింది. ప్రముఖ తమిళ హీరో శివకార్తికేయన్ ఒక స్పెషల్ రోల్ చేయడం ఈ చిత్రానికి హైలైట్. ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని అందరికీ కలిగిస్తుంది” అన్నారు.