మహేష్ బాబు సినిమాలో సోనాక్షి సిన్హానే ఎందుకో చెప్పిన క్రిష్

మహేష్ బాబు సినిమాలో సోనాక్షి సిన్హానే ఎందుకో చెప్పిన క్రిష్

Published on Feb 13, 2013 6:09 PM IST

Mahesh-Sonakshi
విమర్శకులను మెప్పించే డైరెక్టర్ క్రిష్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న సినిమా ‘శివం’. ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా నటించనుందని ఇది వరకే తెలిపాము. అసలు సోనాక్షి సిన్హానే ఎందుకు తీసుకున్నాడా అనే దానికోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

‘ఈ సినిమా 1950 కాలంలో జరుగుతుంది. అందులోనూ హీరోయిన్ పాత్ర సినిమాకి చాలా కీలకం. ఈ సినిమా కోసం హీరోయిన్ పాత్ర రాసుకుంటున్నప్పుడు నా మైండ్లో సోనాక్షినే ఉంది. సినిమాలో పాత్ర పేరు మీనాక్షి,పాత్ర ప్రకారం ఆమె బాగుండాలి, అంతకన్నా ఎక్కువగా అందమైన కళ్ళు ఉండాలి. నేను దబాంగ్ సినిమా చూసినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. సోనాక్షి కళ్ళలో ఏదో తెలియని పవర్, అలాగే చాలా ఎక్స్ ప్రెసివ్ గానూ ఉంటాయని’ క్రిష్ ఓ ప్రముఖ న్యూస్ పేపర్ కి చెప్పారు. ఈ వార్త ఆసక్తికరంగా ఉంది కదూ, మరి మీరేమంటారు ఫ్రెండ్స్?

ఈ సంవత్సరం రెండవ అర్ధభాగంలో సెట్స్ పైకి వెళ్ళే ఈ సినిమాని అశ్వినీ దత్ నిర్మించనున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘ఆగడు’ సినిమా సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు