ఈరోజు విడుదలైన గోవిందుడు అందరివాడేలే’ టీజర్ వేడుకలో దర్శకుడు కృష్ణవంశీ స్పీచ్ ఎమోషనల్ గా సాగింది. జీవితంమీద ఆశ వదిలేసుకున్న సమయంలో చిరంజీవి, చరణ్ లు తనకు ఆశాకిరణంగా కనిపించారని తెలిపాడు
“చిరు మరియు చెర్రీలు నాకు చాలా సహాయపడ్డారు. వారి ప్రవర్తన, నడవడిక నన్ను మామోలు మనిషిని చెయ్యగలిగాయి” అని చెప్పాడు,కృష్ణవంశీ స్టార్ డైరెక్టర్ అయినా ఆయనకి హిట్ వచ్చి చాన్నాళ్ళు అయింది. కాబట్టి ఈ గోవిందుడు అందరివాడేలే’ సినిమాను ఎలా తీస్తాడు అన్న విషయం ఆసక్తికరంగా మారింది


