చివరి దశకు చేరుకున్న ‘రంగమార్తాండ’ !

చివరి దశకు చేరుకున్న ‘రంగమార్తాండ’ !

Published on Oct 25, 2020 2:31 AM IST

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ ఆయన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోతున్నాయి. అప్పట్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా తన హావా చూపించిన ఈ వినూత్న దర్శకుడు, ప్రస్తుతం ‘రంగమార్తాండ’ అనే సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపు 80 శాతం పూర్తి చేసుకుంది. మరో షెడ్యూల్ ఒక్కటే ఇక బ్యాలెన్స్ ఉంది. వచ్చే వారం నుండి ‘రంగమార్తాండ’ షూటింగ్ ప్లాన్ చేస్తోనట్లు.. ప్రకాష్ రాజ్ – రమ్యకృష్ణ పై కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతునట్లు.. ఇవి తీస్తే ఇక సినిమా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో అనసూయకు ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. అనసూయ పాత్ర కథలో కీలకంగా ఉంటుందట. నాటకాలు వేసే కళాకారిణిగా ఆమె నటిస్తోందట. పైగా జీవితాంతం అవివాహిత గానే ఉండే స్త్రీ పాత్రలో అనసూయ నటిస్తోందట. కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు