జనవరి 23న విడుదలకానున్న లేడీస్ అండ్ జెంటిల్ మెన్

lades-and-jentil-men
సైబర్ క్రైమ్ నేపధ్యంలో తెరకెక్కించిన ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ సినిమా వచ్చే ఏడాది జనవరి 23 న విడుదలకు సిద్ధపడుతుంది. ఈ సినిమా దర్శకుడు పి.బి మంజునాద్ మాట్లాడుతూ “గత కొన్నేళ్ళుగా సైబర్ క్రైమ్ నేపధ్యంలో సాగుతున్న నేరాల సంఖ్య ఎక్కువైపోతుంది. సోషల్ మీడియా, సైబర్ క్రైమ్, మానవీయ విలువల నేపధ్యంలో తెరకెక్కించిన చిత్రమిది” అన్నారు. ఇటీవలే విడుదల చేసిన ఆడియోకి మంచి స్పందన వచ్చిందని తెలిపారు

ఈ సినిమాలో చైతన్య కృష్ణ, అడివి శేష్, మహత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, నిఖితా నారాయణ్, జాస్మిన్ మరియు స్వాతీ దీక్షిత్ ప్రధాన తారాగణం. రఘు కుంచె సంగీత దర్శకుడు. మధుర శ్రీధర్ నిర్మాత

Exit mobile version